Gadchiroli encounter | మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఎన్కౌంటర్ జరిగిన విషయాన్ని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ధ్రువీకరించారు. మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో నలుగురు జవాన్లు గాయపడినట్లు తెలిపారు. గాయపడిన జవాన్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
శనివారం ఉదయం గ్యారపట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న పోలీసు బలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఉదయం నుంచి ఈ కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం 26 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు.ఈ కాల్పులతో సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలిలో కూంబింగ్ కొనసాగుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు టెక్ రవి మృతి
అటెండర్ విడుదల.. మావోయిస్టుల చెరలోనే సబ్ ఇంజినీర్
ఇన్ఫార్మర్ నెపంతో యువకుడిని చంపిన మావోయిస్టులు