కొత్తగూడెం క్రైం, న్యూఢిల్లీ : వివిధ రాష్ట్రాల్లోరహదారులు రక్తమోడాయి. ఛత్తీస్గఢ్లో జాగ్త్రా సమీపంలో జాతీయ రహదారి-30పై బుధవారం రాత్రి ట్రక్, కారు ఢీకొన్న ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. గురువారం మధ్యాహ్నం రాజస్థాన్లోని జైపూర్-అజ్మీర్ రహదారిలో రామ్నగర్ వద్ద ట్యాంకర్ ట్రక్ కారు పైకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 8 మంది అసువులు బాసారు.
గురువారం తమిళనాడులోని మామళ్లపురం వద్ద ఆర్టీసీ బస్సు ఆటో రిక్షాపై దూసుకెళ్లిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.