భువనేశ్వర్: ఒడిశాలోని (Odisha) బాలాసోర్ (Balasore) సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో మూడు రైళ్లు ఢీకోన్న ఘటన తీవ్ర విషాధాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 230 మంది అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగి 280కి చేరినట్లు తెలుస్తోంది.
బెంగళూరు నుంచి పశ్చిమబెంగాల్లోని హోప్డా వెళ్తున్న బెంగళూరు హోప్డా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బాలాసోర్ సమీపంలోని బహనగా బజార్ వద్ద పట్టాలు తప్పింది. దాని బోగీలు పక్కనే ఉన్న పట్టాలపై పడిపోయాయి. ఈ పడిపోయిన బోగీలను అటువైపునుంచి వచ్చిన షాలిమర్ – చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకోంది. దాంతో కోరమండల్ రైలుకు చెందిన 15 బోగీలు పట్టాలు తప్పి ఆ పక్కనే ఉన్న ట్రాక్పై బోల్తా పడ్డాయి. బోల్తాపడ్డ కోరమండల్ బోగీలను మరోవైపు నుంచి వచ్చిన గూడ్స్రైలు బలంగా ఢికొట్టింది. కేవలం 15 నిమిషాల్లోనే మూడు ప్రమాదాలు జరిగాయి.
ఈ ప్రమదాంలో 280 మంది మరణించడంతో పాటు మరో 900 మందికిపైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాధితుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కూడా ఉన్నారు. ఘటనా స్థాలంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఒడీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రైలు బోగీల్లో చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితులను దవాఖానలకు తరలించేందుకు 200 అంబులెన్సులను ఒడిశా ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఘటనా స్థలాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రమాద స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
#WATCH | Railways Minister Ashwini Vaishnaw takes stock of the situation at the accident site in Balasore where search and rescue operation is underway#BalasoreTrainAccident pic.twitter.com/CTOSoDiqAd
— ANI (@ANI) June 3, 2023
కాగా, పట్టాలపై రైలు బోగీలు పడిఉండటంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారిమళ్లించారు. బాలేశ్వర్ మీదుగా దూరప్రాంతాలకు వెళ్లాల్సిన 43 రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. మరో 38 రైళ్లను ఇతర ప్రాంతాల మీదుగా నడుపుతున్నారు. రైలు ప్రమాదంపై వివరాలు అందించేందుకు రైల్వే శాఖ అధికారులు పలు హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు.
అవి..సికింద్రాబాద్ రైల్ నిలయం (040 27788516), విజయవాడ రైల్వే స్టేషన్ (0866 2576924), రాజమండ్రి రైల్వే స్టేషన్ (0883 2420541), రేణిగుంట రైల్వే స్టేషన్ (9949198414), తిరుపతి రైల్వే స్టేషన్ (781595571), విజయనగరం హెల్ప్లైన్ (08922 221202, 221206), ఒడిశా ప్రభుత్వం ఏర్పాటుచేసిన నంబర్ 06782-26228 సహాయ కేంద్రాలకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని రైల్వే వర్గాలు వెల్లడించాయి.
Death toll rises to 233 in the Balasore Train Accident. @CMO_Odisha @IPR_Odisha @RailMinIndia @SecyChief @SRC_Odisha
— Pradeep Jena IAS (@PradeepJenaIAS) June 3, 2023
#WATCH | Odisha | Search and rescue operation underway for #BalasoreTrainAccident that claimed 233 lives so far.
As per State's Chief Secretary Pradeep Jena, one severely damaged compartment still remains and NDRF, ODRAF & Fire Service are working to cut through it to try to… pic.twitter.com/BQZSm0JQ4z
— ANI (@ANI) June 3, 2023
#WATCH | Odisha: Rescue operations underway at Balashore where two passenger trains and one goods train met with an accident yesterday, killing 233 people and injuring 900 pic.twitter.com/o9Vl2Rbz71
— ANI (@ANI) June 3, 2023
#WATCH | Latest visuals from the site of the deadly train accident in Odisha's Balasore. Rescue operations underway
The current death toll stands at 233 pic.twitter.com/H1aMrr3zxR
— ANI (@ANI) June 3, 2023