బెంగళూరు : కర్నాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతున్నది. ఉప్పినగండి ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీ యాజమాన్యం తరగతి గదిలో హిజాబ్ ధరించాలని అనుమతించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన 23 మంది విద్యార్థినులను సస్పెండ్ చేసింది. గతవారం దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని కళాశాలకు వచ్చిన విద్యార్థులు.. తరగతి గదిలో హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కళాశాల యజమాన్యం సోమవారం అందరినీ సస్పెండ్ చేసింది.
విద్యార్థినులందరూ వారం పాటు కాలేజీకి రాకుండా రోజుల పాటు నిషేధం విధించింది. ఈ ఏడాది మార్చిలో కర్నాటక హైకోర్టు వివాదంపై ఆదేశాలను జారీ చేసినా.. హిజాబ్ ధరించేందుకు అనుమతివ్వాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. కర్నాటక హైకోర్టు ఇస్లాంలో హిజాబ్ ప్రస్తావన లేదని, విద్యాసంస్థల్లో ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ నిబంధనను పాటించాలని కోర్టు తీర్పునిచ్చింది.