పారాదీప్, డిసెంబర్ 1: ఒడిశాలోని పారాదీప్ పోర్టులో అధికారులు భారీగా మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు. ఓ ఓడపై దాడి చేసిన అధికారులు రూ.220 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ కమిషనరేట్ కథనం ప్రకారం పారాదీప్ పోర్టులో పనామాకు చెందిన కార్గో షిప్ వచ్చి ఆగింది. ఇక్కడి నుంచి డెన్మార్క్ వెళ్లాల్సిన ఈ ఓడలోని క్రేన్లో తెల్లటి పౌడర్తో ఉన్న కొన్ని ప్యాకెట్లను ఆపరేటర్ గమనించి, అది పేలుడు పదార్థంగా భావించి అధికారులకు తెలిపాడు. వారు 22 ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని పరీక్షకు పంపగా అది కొకైన్గా నిర్ధారణ అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ రూ.220 కోట్ల వరకు ఉంటుంది. దీంతో ఓడ సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.