బయటపడ్డ 200 పాములు, 100 గుడ్లు
కందుకూరు, ఏప్రిల్ 12: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో పాములు కలకలం సృష్టించాయి. ఒకేసారి పుట్టలోంచి 200 పాములు, వందకుపైగా గుడ్లు బయటపడటంతో స్థానికులు ఆందోళన చెందారు. మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం గఫూర్నగర్కు చెందిన ఈర్లపల్లి దయానంద్ నివసిస్తున్న ఇల్లు, పశువుల కొట్టం ఒకే దగ్గర ఉన్నాయి. సోమవారం సాయంత్రం దయానంద్ కుటుంబ సభ్యులు ఇంటి ముందున్న చెట్టు కింద కూర్చోని ఉండగా పశువుల కొట్టంలో ఉన్న పుట్టలోంచి పాము బయటకు వచ్చింది. దాన్ని చూసిన కుటుంబీకులు స్థానికులతో కలిసి పుట్టను తవ్వారు. అందులోంచి రెండు వందలకుపైగా పాములు, వంద గుండ్లు బయటపడ్డాయి. వెంటనే వాటిని చంపేసి.. గుడ్లను పగులగొట్టారు. గుడ్లను పగులగొట్టినప్పటికీ కొన్నింటిలో నుంచి పాములు బయటకు వచ్చాయి. ఒకేసారి భారీ స్థాయిలో పాములు, గుడ్లు బయటపడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.