న్యూఢిల్లీ : భారత్కు చెందిన 20 మంది జాలర్లను కరాచీలోని లాంధీ జైలు నుంచి పాకిస్థాన్ శనివారం విడుదల చేసింది. వారిని ఆదివారం వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించనున్నారు. వీరంతా గుజరాత్కు చెందిన వారని, 350 మంది భారతీయ జాలర్లు జైలు శిక్ష పూర్తి చేసుకోగా.. బ్యాచ్ల వారీగా విడుదల చేస్తారని సీనియర్ జైలు అధికారి తెలిపారు. ఆదివారం ఉదయం వాఘా – అట్టారీ సరిహద్దుకు తీసుకురానున్నారు.
20 మంది జాలర్లను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. పాకిస్థాన్ సముద్ర జలాల్లో అక్రమంగా చేపలు వేటాడుతున్నారనే ఆరోపణలపై మత్స్సకారులను పాక్ సముద్ర భద్రతా దళం (పీఎంఎస్ఎఫ్) అరెస్టు చేసి డాక్ పోలీసులకు అప్పగించారు. సుమారు 600 మంది వరకు భారతీయ జాలర్లు పాక్ జైళ్లలో ఉన్నారని భావిస్తున్నారు. 350 మంది భారతీయ జాలర్లను విడుదల వారీగా జాతీయతను ఇరుదేశాలు విదేశాంగ శాఖ ద్వారా నిర్ధారించిన అనంతరం బ్యాచుల వారీగా విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.