Borewell | పొలంలోని బోరు బావి (Borewell)లో పడిపోయిన రెండేళ్ల బాలుడిని అధికారులు రక్షించారు. సుమారు 18 గంటల పాటు తీవ్రంగా శ్రమించి చిన్నారిని బోరుబావినుంచి బయటకు తీసుకొచ్చారు. కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
లచయానా గ్రామానికి (Lachayan village) చెందిన సతీశ్ ముజగొండ తన ఇంటి వద్ద ఉన్న నాలుగు ఎకరాల పొలంలో బోరుబావి తవ్వించాడు. బుధవారం సాయంత్రం సమయంలో సతీశ్ రెండేళ్ల కుమారుడు సాత్విక్ పొలం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు (child fell into the borewell ). చిన్నారి ఏడుపు విన్న కొందరు స్థానికులు వెంటనే ఆ బాలుడి తల్లిదండ్రులకు, అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 16 అడుగుల లోతులో పడిపోయిన బాలుడి కోసం బుధవారం సాయంత్రం 6:30 గంటల నుంచి తీవ్రంగా శ్రమించారు. ఎక్స్కవేటర్తో బోర్వెల్కు సమాంతరంగా 21 అడుగుల లోతులో గొయ్యి తవ్వారు. 18 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఎట్టకేలకు బాలుడిని బయటకు తీసుకొచ్చారు. అయితే, ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై స్పష్టత లేదు. అంబులెన్స్తో అక్కడ సిద్ధంగా ఉన్న వైద్య బృందం బాలుడికి అత్యవసర ప్రథమ చికిత్స అనంతరం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
Also Read..
Gold Price | పసిడి భగభగలు.. రూ.70వేల మార్క్ను దాటిన 10 గ్రాముల బంగారం ధర
Sonia Gandhi | తొలిసారి పెద్దల సభకు సోనియా గాంధీ.. రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం