శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఉన్న ఉరి సెక్టార్(Uri sector)ప్రాంతంలో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్(Encounter)లో ఇద్దరు మిలిటెంట్లు మృతిచెందారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న హత్లాంగ్ ఫార్వర్డ్ ఏరియాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో మిలిటెంట్లు సంచరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో.. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చట్టుముట్టాయి. సెర్చ్ ఆపరేషన్ సమయంలో తీవ్ర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అనుమానిత లొకేషన్ వద్దకు భద్రతా బలగాలు చేరుకున్న సమయంలో.. మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగాయి. ఉరి సెక్టర్లోని హత్లాంగ్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ ఉగ్ర వేట కొనసాగుతోంది.