చండీఘఢ్ : పవర్ కేబుల్స్ను చోరీ చేశారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను కేబుల్స్తో చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన పంజాబ్లోని భటిండా జిల్లాలో వెలుగుచూసింది. పవర్ కేబుల్స్ను దొంగిలించారనే అనుమానంతో ఇద్దరిని గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భగ్తా భైకా అనే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో వాటర్ మోటార్కు బిగించిన పవర్ కేబుల్స్ను కొందరు అపహరించిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గ్రామస్తులు కొందరు తామే నిందితులను పట్టుకునేందుకు చొరవ చూపారు. ఇద్దరు వ్యక్తుల వద్ద చోరీకి గురైన పవర్ కేబుల్స్ కనిపించడంతో వారిని చెట్టుకు కట్టి తీవ్రంగా కొట్టారు. ఆపై వారిని పోలీసులకు అప్పగించారు. ఇద్దరు వ్యక్తులను హింసించిన కొందరు గ్రామస్తులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
ఈ వీడియోలో అనుమానితులను హింసిస్తూ కనిపించిన ఇతర వ్యక్తులనూ అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. చట్టాన్ని ప్రజలు తమ చేతుల్లోకి తీసుకోవద్దని నేర సమాచారం తమకు చేరవేయాలని పోలీసులు గ్రామస్తులను కోరారు. ప్రజలు తమకు సమాచారం అందిస్తే నేరగాళ్లపై తాము కఠిన చర్యలు చేపడతామని భటిండా ఎస్పీ అజయ్ గాంధీ పేర్కొన్నారు.
Read More :
Diabetes | డయాబెటిస్ ఉన్నవాళ్లు మక్కలు తినొచ్చా?