పాట్నా, ఫిబ్రవరి 6: బీహార్లో విచిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ రైలు ఇంజిన్, బ్రిడ్జి చోరీ కాగా.. తాజాగా రెండు కిలోమీటర్ల మేర రైలు పట్టాలను దొంగలు ఎత్తికెళ్లిన ఘటన సమస్తిపూర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఓ మిల్లు నుంచి సరుకులను రైల్వే స్టేషన్కు తీసుకెళ్లడానికి పట్టాలు వేశారు. అయితే ఆ మిల్లు మూతపడింది. దీంతో ఈ పట్టాలు నిరుపయోగంగా మారాయి. ఇదే అదునుగా భావించిన కొందరు ఈ పట్టాలను దొంగలించారు. అయితే స్థానిక రైల్వే అధికారులు, మిల్లు యజమాని కుమ్మక్కై పట్టాలను అమ్ముకున్నట్టు వదంతులు వస్తున్నాయి.