Most Polluted Cities | ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశరాజధాని ఢిల్లీని (New Delhi) దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టాయి. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. తేలికపాటి వర్షంతో గత శనివారం నగరంలో పరిస్థితి కాస్త మెరుగుపడిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను భేఖాతరు చేసి ఢిల్లీ వాసులు ఆదివారం టపాసులు పేల్చడంతో రాజధాని ప్రాంతంలో మరోసారి దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఏక్యూఐ (AQI) అత్యంత ప్రమాదకర స్థాయికి పెరిగింది. ఆదివారం రాత్రి ఏకంగా 680కి పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, దీపావళి ఎఫెక్ట్తో దేశంలోని మరో రెండు నగరాలు కూడా ఢిల్లీ సరసన చేరాయి.
ప్రపంచంలోనే 10 అత్యంత కాలుష్య నగరాల జాబితాను (World Most Polluted Cities) స్విస్ గ్రూప్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ( Swiss group IQAir) తాజాగా విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో దేశరాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక మరో రెండు భారతీయ నగరాలు కూడా టాప్ 10లో నిలిచాయి. దీపావళి కారణంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా (Kolkata), మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) నగరాలు కూడా తీవ్ర వాయుకాలుష్యంలో చిక్కుకున్నాయి. సోమవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 420గా నమోదైంది. ఇది ప్రమాదకర కేటగిరీ కిందకి వస్తుంది. ఇక ఇదే జాబితాలో ఎయిర్ క్వాలిటీ సూచిక 196తో కోల్కతా నాలుగో స్థానంలో ఉంది. ఎయిర్ క్వాలిటీ సూచిక 163తో ముంబై 8వ స్థానంలో నిలిచింది.
ఏక్యూఐ సూచిక 400 నుంచి 500 మధ్య నమోదైతే వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు. ఈ స్థాయిలో ఉండే వాయు కాలుష్యం ఆరోగ్యవంతమైన వ్యక్తులపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఏదైనా వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇది అత్యంత ప్రమాదకరం. ఎయిర్ క్వాలిటీ సూచిక 150 నుంచి 200 మధ్య నమోదైతే అస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఏక్యూఐ 0 నుంచి 50 మధ్య ఉంటే మాత్రమే పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు.
Also Read..
Pollution Particles: ఊపిరితిత్తులను దెబ్బతీసే పార్టికల్స్ గాలిలో 140 శాతం పెరిగాయి..
Air pollution | ఢిల్లీలో మరింత తీవ్రంగా ఎయిర్ పొల్యూషన్.. సుప్రీంకోర్టు ఆదేశాలు భేఖాతర్
Silent Diwali | అక్కడ 22 ఏళ్లుగా నిశ్శబ్ద దీపావళి.. ఆదర్శంగా నిలుస్తున్న ఆ ఏడు గ్రామాలు