Bee Attack | తేనెటీగల దాడి (Bee Attack)లో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మన్కాపూర్ (Mankapur) ప్రాంతంలోని మద్నాపూర్ గ్రామానికి ( Madnapur village ) చెందిన ఉత్తమ (65) తన మనవళ్లు యుగ్ (4), యోగేష్ (6)లతో కలిసి మంగళవారం సాయంత్రం సమయంలో బయటకు వెళ్లింది. ఆ సమయంలో తేనెటీగల గుంపు వారిపై దాడి చేశాయి. స్థానికులు వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ యుగ్ మృతి చెందాడు. అనంతరం ఉత్తమ, యోగేష్లను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ యోగేష్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఉత్తమ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు స్థానిక ఎస్హెచ్వో సుధీర్ కుమార్ సింగ్ తెలిపారు.
Also Read..
Ganesh Chaturthi | అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు.. కదిలిన తారాలోకం.. ఫొటోలు
Nawaz Sharif | భారత్ చంద్రుడిని చేరితే.. పాక్ అడుక్కునే స్థితికి చేరింది : నవాజ్ షరీఫ్