Age Limit On Social Media | దేశంలో సోషల్ మీడియా వినియోగంపై వయోపరిమితిని (Age Limit On Social Media ) విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని కర్ణాటక హైకోర్టు (Karnataka High Court ) మంగళవారం పేర్కొంది. సోషల్ మీడియాను ఉపయోగించడానికి కనీస వయసు 21 ఏళ్లు ఉండాలని సూచించింది. నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను బ్లాక్ చేయాలనే కేంద్ర ఆదేశాలను సవాల్ చేస్తూ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) చేసిన అప్పీల్పై న్యాయమూర్తులు జీ నరేందర్, విజయకుమార్ ఏ పాటిల్లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా గతంలో కేంద్ర ప్రభుత్వంపై సోషల్ మీడియా సంస్థ వేసిన పిటిషన్ను కొట్టివేసిన కోర్టు.. ఆదేశాలను పాటించనందుకు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఈ విచారణ ముగింపు సందర్భంగా.. కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాని పూర్తిగా నిషేధించడమే బెస్ట్ ఆప్షన్ అని పేర్కొంది. దాని వల్ల చాలా మేలు జరుగుతుందని వ్యాఖ్యానించింది. నేడు పాఠశాలలకు వెళ్లే పిల్లలు సోషల్ మీడియాకు ఎక్కువగా బానిసలవుతున్నారని తెలిపింది. ఎక్సైజ్ నిబంధనల మాదిరిగా ఇక్కడ కూడా వయోపరిమితి ఉండాలని తాము భావిస్తున్నట్లు వ్యాఖ్యానించింది.
కాగా, కొన్ని ఆన్లైన్ గేమ్స్ యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు యూజర్ ఆధార్, ఇతర పత్రాలను సబ్మిట్ చేయాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే.. అటువంటి గుర్తింపును సోషల్ మీడియాకు కూడా ఎందుకు విస్తరించడం లేదని కోర్టు ప్రశ్నించింది.
Also Read..
Ganesh Chaturthi | అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు.. కదిలిన తారాలోకం.. ఫొటోలు
Nawaz Sharif | భారత్ చంద్రుడిని చేరితే.. పాక్ అడుక్కునే స్థితికి చేరింది : నవాజ్ షరీఫ్
IndiGo | విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరవబోయిన ప్రయాణికుడు..!