న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. బుధవారం 14,623 కేసులు నమోదవగా, తాజాగా అవి 18 వేలు దాటాయి. ఇది నిన్నటికంటే 26 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 11 వేల కేసులు కేరళలోనే ఉన్నాయి. కాగా, రోజువారీ కేసులు 30 వేల లోపు రికార్డవడం ఇది వరుసగా 27వ రోజు.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,454 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,27,450కి చేరాయి. ఇందులో 1,78,831 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,34,95,808 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,52,811 మంది మహమ్మారికి బలయ్యారు. రికవరీ రేటు 98.15 శాతంగా ఉండగా, యాక్టివ్ కేసులు 0.52 శాతం ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వంద కోట్లు దాటింది.