Encounter | రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకులు గర్జించాయి. కాంకేర్ జిల్లా కల్పర్ అడవిలో జరిగిన ఎదురుకాల్పుల్లో తూటాల వర్షం కురిసింది. ఈ తూటాలకు 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. చోటి బిటీయా పోలీసు స్టేషన్ పరిధిలోని కల్పర్ అడవిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. ఘటనాస్థలి నుంచి ఏకే47 తుపాకులు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.