థాణే, ఆగస్టు 13: మహారాష్ట్రలోని థాణేలో ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ దవాఖానలో 24 గంటల వ్యవధిలోనే 18 మంది మరణించడం కలకలం రేపింది. వీరిలో 13 మంది ఐసీయూలో చికిత్స పొందుతుండేవారు. హెల్త్ కమిషనర్ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీని వేసి దర్యాప్తు చేయాలని సీఎం షిండే అదేశించారు.
మృతులు కిడ్నీలో రాళ్లు, పక్షవాతం, అల్సర్, నిమోనియా, విషం తాగడం వంటి రుగ్మతలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. సాధారణంగా దవాఖానలో ప్రతిరోజు ఆరు నుంచి ఏడు మరణాలు నమోదవుతాయని డీసీపీ గ్వాడే పేర్కొన్నారు.