త్రిసూర్: దేవనంద(17).. కేరళకు చెందిన 12వ తరగతి విద్యార్థిని. వయసు చిన్నదైనా పెద్ద నిర్ణయం తీసుకుంది. కాలేయ వ్యాధితో బాధ పడుతున్న తండ్రిని బతికించుకోవడానికి తన కాలేయంలో కొంత భాగాన్ని దానమిచ్చింది. దేశంలోనే అవయవ దానం చేసిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. దేవనంద తండ్రి ప్రతీష్(48) త్రిసూర్లో ఒక కేఫ్ నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా ఆయన దీర్ఘకాలిక కాలేయ వ్యాధి, క్యాన్సర్తో బాధ పడుతున్నారు. ఆయనకు కాలేయాన్ని దానం చేసే దాతల కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.దీంతో దేవసేన తన కాలేయంలో కొంత భాగాన్ని తండ్రికి దానమివ్వాలని నిర్ణయించుకుంది.
భారత్లో మైనర్ల అవయవ దానానికి చట్టం ఒప్పుకోక పోవడంతో ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించి తన తండ్రి పరిస్థితిని వివరించి తన అవయవ దానానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించింది. గతంలో ఇలాంటి ఒక కేసులో మైనర్ అవయవ దానం చేయడానికి కోర్టు అంగీకరించిందని తెలిపింది. తండ్రి ప్రాణం కోసం ఆమె పడుతున్న ఆరాటాన్ని గమనించిన హైకోర్టు ఆమె ప్రయత్నాన్ని ప్రశంసించి అనుమతి జారీ చేసింది. మరోవైపు మంచి స్థితిలో ఉన్న కాలేయాన్ని తండ్రికి దానం చేయడం కోసం దేవసేన వ్యాయామశాలలో క్రమం తప్పకుండా కసరత్తులు చేసింది. ఈ నెల 9న ప్రతీష్కు విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది.