Lightning strike | భువనేశ్వర్ : ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. గరద్పూర్ పాఠశాలపై పిడుగు పడింది. విద్యార్థులు తమ తరగతి గదుల నుంచి బయటకు వస్తున్న సమయంలో పిడుగు పడటంతో 17 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధిత విద్యార్థులంతా 6, 7 తరగతులకు చెందిన వారని ఉపాధ్యాయులు తెలిపారు. 17 మందిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం కేంద్రపడ జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.