BJP | హైదరాబాద్, ఏప్రిల్ 6 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును తీసుకొచ్చామని చెప్పుకొనే బీజేపీ.. లోక్సభ ఎన్నికల టికెట్ల కేటాయింపులో మాత్రం మహిళలపై చిన్నచూపు చూసింది.
ఆ పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన 417 మంది అభ్యర్థుల్లో మహిళలు కేవలం 68 మంది(16 శాతం) మాత్రమే కావడం ఇందుకు నిదర్శనం. ఇందులోనూ 40 మంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే. వీరిలోనూ రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ర్టాల రాజ కుటుంబాలకు చెందిన వారికే కమలం పార్టీ ప్రాధాన్యమిచ్చింది.