కులూ: హిమాచల్ప్రదేశ్లోని కులూ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జునుజ్జు అయింది. జిల్లాలోని సైంజికి వెళ్తుండగా ఉదయం 8.30 గంటల సమయంలో జాంగ్లా వద్ద అదుపుతప్పిన బస్సు.. లోయలో పడిపోయిందని చెప్పారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తలించామని వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.