యూపీలో పండుగపూట విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 15 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బిజ్నోర్ జిల్లా అలీపూర్మాన్ వద్ద ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మరణించారు. కారులో చిక్కుకుపోయిన మరో ముగ్గురిని స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఝాన్సీలో ఓ ట్రాక్టర్ బోల్తా పడటంతో 11 మంది మృతిచెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులే కావడం గమనార్హం.