న్యూఢిల్లీ: సుమారు 15 మంది మాజీ ఎమ్మెల్యేలు (Former MLAs Join BJP) మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో వారంతా బీజేపీ సభ్యత్వం తీసుకుని ఆ పార్టీ కండువాలు కప్పుకున్నారు. బీజేపీలో చేరిన నేతలంతా తమిళనాడుకు చెందిన వారు. గతంలో బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్న ఏఐఏడీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. ఏఐఏడీఎంకే మాజీ నేతలు కే వడివేల్, ఎంవీ రత్నం, ఆర్ చిన్నస్వామి, పీఎస్ కందసామి సహా పలువురు నేతలు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై సమక్షంలో బుధవారం ఆ పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇతర సీనియర్ బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, తమిళనాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడాన్ని ఆ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్వాగతించారు. బీజేపీకి అనుభవ సందప తీసుకొచ్చామని తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ బలోపేతమవుతున్నదని, మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు.