DWDR | న్యూఢిల్లీ : విదేశాల్లో పని చేస్తున్న భారతీయులు బాగానే సంపాదిస్తున్నారు. దేశీయ వలసదారుల ఆదాయంలో 40 శాతం వృద్ధి నమోదు కాగా, విదేశాల్లో పనిచేసే భారతీయుల ఆదాయంలో 120 శాతం పెరుగుదల కనిపించిందని ప్రపంచ అభివృద్ధి నివేదిక (డబ్ల్యూడీఆర్)-2023 వెల్లడించింది. అమెరికాకు వలస వెళ్లిన తక్కువ నైపుణ్యాలు గల భారతీయుల ఆదాయంలో 500 శాతం వృద్ధి నమోదైందని, ఈ వృద్ధి యూఏఈలో 300 శాతంగా ఉన్నదని నివేదిక తెలిపింది. గల్ఫ్లో భారతీయుల ఆదాయంలో తక్కువ వృద్ధి నమోదైందని నివేదిక వెల్లడించింది. నైపుణ్యాలు, వయసు, పని చేసే దేశం, భాషా సామర్థ్యాలు వ్యక్తుల ఆదాయ వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయని డబ్ల్యూడీఆర్ తెలిపింది.