Jharkhand | రాంచీ : జార్ఖండ్లో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. అసన్సోల్ డివిజన్ జంతారా ప్రాంతంలోని ఖల్జరియా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను బెంగళూరు – భాగల్పూర్ ఎక్స్ప్రెస్ రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్ల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.