డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు అనియంత్రితంగా మారాయి. రెండు రోజులుగా దావానలం కొనసాగుతూనే ఉన్నది. గత 24 గంటల్లో 45 కొత్త అడవులకు మంటలు పాకాయి. అగ్నికీలల కారణంగా ఇప్పటివరకు 63 హెక్టార్ల అడవి బుగ్గయిపోయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్.. కేంద్రం సహాయాన్ని అభ్యర్థించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం రెండు హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఉత్తరాఖండ్కు పంపింది.
కార్బెట్ నేషనల్ పార్క్ లోని అడవిలో అగ్ని ప్రమాదం పెరిగింది. శనివారం రాత్రికి రామ్నగర్ ఫారెస్ట్ డివిజన్కు చెందిన మోహన్ సమీపంలోని అడవిలో మంటలు చెలరేగాయి. ఇది టెరాయ్ వెస్ట్ ఫారెస్ట్ డివిజన్లోని సవాల్డే, హల్డువా, కాశిపూర్ శ్రేణుల అడవులను బుగ్గిచేయడానికి దారితీసింది. ఈ ప్రాంతాలు కార్బెట్ పార్కు ప్రక్కనే ఉన్నాయి.
రాష్ట్రంలోని 964 ప్రదేశాలలో మంటలు కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి హరక్ సింగ్ రావత్ చెప్పారు. వాతావరణం పరిస్థితిని మరింత ఇబ్బందికరంగా తయారు చేసింది. ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ఈ విషయంపై నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. హెలికాప్టర్తో మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
మంటలనార్పే విధుల్లో 12,000 కన్నా ఎక్కువ అటవీ సిబ్బంది పాల్గొంటున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఉద్యోగులకు సెలవు ఇవ్వవద్దని అత్యవసర సమావేశంలో ముఖ్యమంత్రి రావత్.. అటవీ అధికారులు, జిల్లా అధికారులను ఆదేశించారు. 2020 అక్టోబర్ 1 నుంచి 1,359 హెక్టార్లలో 1,028 ప్రాంతాల్లో మంటలు సంభవించినట్లు అటవీ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఈ సంఘటనలు నైనిటాల్, అల్మోరా, టెహ్రీ గర్హ్వాల్, పౌరి గర్హ్వాల్ జిల్లాల్లో కనిపించాయి.
మరోవైపు హిమాచల్ కార్సోగ్ అడవిలో గత రెండు రోజులుగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. పెద్ద ఎత్తున అటవీ సంపద బూడిదవుతున్నది. 30 హెక్టార్ల భూమిలో వివిధ రకాల చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి.
అణగారిన వర్గాల గొంతుక బాబుజీ.. చరిత్రలో ఈరోజు
అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన
ఫాల్కే అవార్డును దోస్త్ రాజ్ బహదూర్కు అంకితం చేస్తున్నా: రజినీకాంత్
ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..