న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు (Operation Sindhu) ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం గురువారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. టెహ్రాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్న వెళ, ఈ విద్యార్థులను ఉత్తర ఇరాన్ నుంచి అర్మేనియా రాజధాని యెరవాన్కు జూన్ 17న తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకువచ్చారు. వారిలో 90 మంది జమ్ముకశ్మీర్కు చెందిన వారే ఉన్నారు. వీరంతా ఉర్మియా మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.
ఢిల్లీలో దిగిన తర్వాత అమన్ అజార్ అనే విద్యార్థి ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కుటుంబాన్ని కలిసిన తర్వాత నాకు ఎలా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేను. ఇరాన్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడి ప్రజలు కూడా మనలాగే ఉన్నారు, చిన్న పిల్లలు బాధపడుతున్నారు. యుద్ధం ఎవరికీ మంచిది కాదు. ఇది మానవత్వాన్ని నాశనం చేస్తుంది’ అని చెప్పారు.
#WATCH | Flight carrying 110 Indian Nationals evacuated from Iran, lands in Delhi.
Amaan Azhar, a student evacuated from Iran, says, “I am very happy. I cannot express in words how happy I am to be finally able to meet my family. The situation in Iran is very bad. The people… pic.twitter.com/GjMqQMD6DG
— ANI (@ANI) June 18, 2025
MEA Spokesperson Randhir Jaiswal tweets, “Operation Sindhu begins. India launched Operation Sindhu to evacuate Indian nationals from Iran. India evacuated 110 students from northern Iran who crossed into Armenia under the supervision of our Missions in Iran and Armenia on 17th… pic.twitter.com/TpxetOejM6
— ANI (@ANI) June 18, 2025
ఇరాన్లో సుమారు 13 వేల మందికిపైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారిలో అత్యధికులు వైద్య విద్యనే అభ్యసిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఇతర పౌరులు సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఆ రెండు దేశాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణవాసులకు సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్లైన్ ప్రారంభించింది. ఇప్పటి వరకూ తెలంగాణ వాసులు ఎవరూ ప్రభావితమైనట్లు సమాచారం లేకపోయినా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఈ హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా తాము ఉంటున్న దేశాల్లో గానీ, ప్రయాణాల్లో గానీ ఇబ్బంది పడుతున్న తెలంగాణవాసులు కింద పేర్కొన్న ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం పేర్కొంది.