కోల్కతా, అక్టోబర్ 9: బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింస కేసులో సీబీఐ 11 మందిని అరెస్టు చేసింది. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ అంతటా హింస చెలరేగింది. పలువురు హత్యకు గురయ్యారు. దీనిపై కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అదే సమయంలో తక్కువ తీవ్రత గల కేసుల దర్యాప్తునకు సిట్ను నియమించింది. తాజాగా అరెస్టు చేసినవారంత తూర్పు మేదినీపూర్కు చెందిన వారని సీబీఐ తెలిపింది.