న్యూఢిల్లీ: మన దేశం నుంచి 10,000 మంది భవన నిర్మాణ కార్మికులు వచ్చే వారం వేర్వేరు బృందాలుగా ఇజ్రాయెల్కు వెళ్లబోతున్నారు. ఒక్కో బృందంలో సుమారు 700 నుంచి 1,000 మంది వరకు ఉంటారని ఇజ్రాయెల్ బిల్డర్స్ అసోసియేషన్ వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపాయి. హమాస్ ఉగ్రవాద సంస్థతో యుద్ధం వల్ల ఇజ్రాయెల్లో ఉద్యోగులు, కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. ఇజ్రాయెల్లో ఉన్న కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవడం వల్ల కార్మికుల కొరత ఏర్పడింది. దీంతో నిర్మాణ రంగంలో విదేశీ కార్మికుల కోటాను 30,000 నుంచి 50,000కు ప్రభుత్వం పెంచింది.