Ayodhya Ram Mandir : జనవరి 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయ ప్రారంభోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఆ రోజున శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి 55 దేశాల నుంచి రాయబారులు, ఎంపీలు సహా దాదాపు 100 మంది హాజరు కానున్నారు. ప్రభు శ్రీరామ్ వంశజ్ అని చెప్పుకునే కొరియన్ రాణిని కూడా ఆహ్వానించామని ప్రపంచ హిందూ ఫౌండేషన్ గ్లోబల్ చైర్మన్ స్వామి విజ్ఞానానంద తెలిపారు.
అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెలారస్, బొత్స్వానా, కెనడా, కొలంబియా, డెన్మార్క్, డొమ్నిక్, కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఫిజీ, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఘనా, గుయానా, హాంకాంగ్, హంగరీ, ఇటలీ, ఇండోనేషియా, బ్రిటన్, అమెరికా, న్యూజిల్యాండ్, సింగపూర్ సహా పలు దేశాల నుంచి అతిధులకు ఆహ్వానాలు అందించామని చెప్పారు.
పలు దేశాధినేతలు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని స్వామి విజ్ఞానానంద వెల్లడించారు. వీవీఐపీ విదేశీ ప్రతినిధులు జనవరి 20న లక్నో వస్తారని ఆపై జనవరి 21 సాయంత్రానికి అయోధ్య చేరుకుంటారని ఆయన తెలిపారు.ఇక జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ సహా పలువురు ప్రముఖుల సమక్షంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది.
Read More :