జైపూర్: ఒక యువతి రాయితో కారు అద్దాలను పగులగొట్టింది. ఆ కారును ధ్వంసం చేసింది. (Young Woman Vandalises Car) ఆ సమయంలో అక్కడున్న జనం చోద్యం చూశారు. ఎవరూ కూడా ఆమెను నిలువరించేందుకు ప్రయత్నించలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్లోని భిల్వారాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 12న అహింసా సర్కిల్ సమీపంలోని ప్రాంతంలో చిన్న సమస్యపై ఇరుగుపొరుగు మధ్య గొడవ జరిగింది. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పొరుగింటి వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
కాగా, పొరుగింటి వారితో గొడవ వల్ల ఆగ్రహించిన యువతి ఆ తర్వాత రోడ్డుపై హంగామా చేసింది. పొరుగింటి వారి ఇంటికి వచ్చిన ఒక వ్యక్తి కారును ధ్వంసం చేసింది. కారుకు అన్ని వైపులా ఉన్న అద్దాలను రాయితో పగులగొట్టి రచ్చ చేసింది. అక్కడున్న జనం చోద్యం చూశారు. ఆ యువతిని నియంత్రించేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో దీనిని రికార్డ్ చేశారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు మళ్లీ అక్కడకు వచ్చారు. ఆ యువతిని కూడా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే ఫిర్యాదు చేసేందుకు ఇరు కుటుంబాలు ముందుకు రాలేదు. దీంతో పొరుగింటి వారికి, ఆ యువతికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. రెండు కుటుంబాలను హెచ్చరించి వదిలేశారు. కాగా, ఆ యువతి రాయితో అద్దాలు పగులగొట్టి కారును ధ్వంసం చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
भीलवाड़ा की घटना।
13 Jan,2024 pic.twitter.com/RBXWJ5ZsUW— Vaibhav Maheshwari (@vaibhavmahe87) January 13, 2024