సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: కర్ణాటక హైకోర్టులో పది మంది తాత్కాలిక న్యాయమూర్తులను పర్మినెంట్ జడ్జిలుగా నియమించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేరళలో ఇద్దరు అదనపు న్యాయమూర్తులను నియమించాలన్న ఆ రాష్ట్ర హైకోర్టు ప్రతిపాదనలను కూడా ఆమోదించింది. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల మంగళవారం సమావేశమై కేంద్రానికి పేర్లను సిఫారసు చేసింది. రికార్డు స్థాయిలో 12 హైకోర్టులకు జడ్జిలుగా 68 మందిని సిఫారసు చేసిన వారం వ్యవధిలోనే కొలీజియం కొత్త సిఫారసులు చేయడం విశేషం.