భువనేశ్వర్: అసోంలోని (Assam) కరీంగంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంగంజ్ జిల్లాలోని బైతఖల్ వద్ద ఆటోను ఓ సిమెంట్ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది మృతిచెందారు. ప్రమాద ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గురువారం ఉదయం 7.30 గంటలకు అసోం-త్రిపుర జాతీయ రహదారి 8పై బైతఖల్ వద్ద ఆటోను ట్రక్కు ఢీకొట్టిందని (accident) చెప్పారు. తొమ్మిది మంది ఘనటనా స్థలంలోనే మృతిచెందారని, మరొకరు దవాఖానలో మరణించారని వెల్లడించారు. ఛాట్ పూజ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుల్లో మహిళలు, యువతులు, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పారు.
ప్రమాద ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ (CM Himanta Biswa Sarma) తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.