శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతున్నది. అనంత్నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కొకెర్నాగ్ ప్రాంతంలోని తంగ్పవా వద్ద ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ఆదివారం రాత్రి గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ టెర్రరిస్టు చనిపోయాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నదని వెల్లడించారు. మృతిచెందిన ముష్కరుడు ఏ ఉగ్రసంస్థకు చెందినవాడనేది ఇంకా గుర్తించాల్సి ఉన్నదని చెప్పారు.
#Encounter has started at Tangpawa area of #Anantnag. Police and security forces are on the job. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) October 9, 2022