కొచ్చి: కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో (Kalamassery) ఉన్న ఓ కన్వన్షన్ సెంటర్లో వరుస పేలుళ్లు (Blast) సంభవించాయి. దీంతో ఒకరు మృతిచెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు. ఆదివారం కాలామస్సేరి నెస్ట్ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో (Convention Centre) క్రిస్టియన్ మతస్థులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. ఉదయం 9.30 గంటల సమయంలో కన్వెన్షన్ హాల్ మధ్యలో ఒక్కరిగా భారీ పేలుడు జరిగింది.
మరికొద్ది క్షణాల్లోనే మరో రెండు, మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. హాలులో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చారు. అయితే కన్వెన్షన్ సెంటర్ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటంతో క్షతగాత్రులను బయటకు తీసుకురావడంలో ఆలస్యమయిందని పోలీసులు తెలిపారు. కాగా, అది బాంబు పేలుడా లేదా మరొకటా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు.
కాగా, ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. పేలుళ్లకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ముగ్గురు ఉన్నతాధికారులు ప్రస్తుతం ఎర్నాకుళంలోనే ఉన్నారని, డీజీపీ కూడా ఘటనా స్థలానికి వెళ్తున్నారని తెలిపారు. ఈ ఘటనను తాము చాలా సీరియస్గా తీసుకుంటున్నామని వెల్లడించారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
It’s a very unfortunate incident. We are collecting details regarding the incident. All top officials are there in Ernakulam. DGP is moving to the spot. We are taking it very seriously. I have spoken to DGP. We need to get more details after the investigation: Kerala CM Pinarayi… https://t.co/4utwtmR9Sl pic.twitter.com/GHwfwieRLB
— ANI (@ANI) October 29, 2023
#WATCH | Visuals from Ernakulam, Kerala where one person died, and several injured in an explosion at a Convention Centre in Kalamassery https://t.co/hir8k808v2 pic.twitter.com/305HuzA4gg
— ANI (@ANI) October 29, 2023