బెంగళూరు: బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్లు నరకానికి రహదారులుగా ఉన్నాయి. ఈ నెలలో మూడు ప్రమాదాలు జరిగాయి. తాజా ప్రమాదంలో ఒక యువకుడు మరణించాడు. ఉత్తర బెంగళూరులోని యలహంకలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. కేరళకు చెందిన యువకుడు బెంగళూరులో పని చేస్తున్నాడు. శనివారం రాత్రి ఆఫీస్ పని ముగిసిన తర్వాత మరో వ్యక్తితో కలిసి బైక్పై ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అయితే గోతుల మయంగా ఉన్న రోడ్డులో ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ ఒక గోతిని తప్పించబోయి బైక్పై వెళ్తున్న వారిద్దరిని ఢీకొట్టాడు. అనంతరం ఆ కారు కూడా ఆ రోడ్డుపై పల్టీకొట్టింది.
కాగా, ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే మరణించాడు. బైక్ వెనక కూర్చొన్న మరో వ్యక్తి, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Another pothole-related death in Bengaluru, third in the month of October.
A car trying to avoid a pothole overturns and collides with a bike coming infront of the car resulting in death of a youngster. The incident took place yesterday night at Yelahanka in Bengaluru north. pic.twitter.com/l2cU3WN1Lz
— Rahul Chauhan (@chauhanrahullll) October 30, 2022