న్యూఢిల్లీ : కరోనా వైరస్తో తలెత్తిన పరిస్థితిని భారత్ సమర్ధంగా ఎదుర్కొంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాధన్ అన్నారు. భారత్లో అత్యధిక జనాభాకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడం సవాల్తో కూడుకున్నదని టీకా సరఫరాలు మెరుగైతే ఈ ప్రక్రియ ఊపందుకుంటుందని వ్యాఖ్యానించారు. మహమ్మారి కట్టడిలో మనం కీలక దశలో ఉన్నామని, ఈ స్ధితిలో మనం ఆశావహంగా ముందుకు వెళ్లడం ముఖ్యమని అన్నారు.
డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన కరోనా టీకాల డేటా సానుకూలంగా ఉందని, బూస్టర్ డోస్ల ఆవశ్యకతపై పరిశీలన జరుగుతోందని చెప్పారు. వ్యాక్సిన్ల పట్ల ప్రజల్లో నెలకొన్న విముఖతను ప్రభుత్వం తొలగించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. విద్యాసంస్ధల పునఃప్రారంభం సందర్భంగా అల్పాదాయ వర్గాలకు చెందిన చిన్నారులపై ప్రభావం అధికంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే నెలల్లో భారత్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.