వంగూరు, మే 16: మండలంలోని వివిధ గ్రామాల్లో లాక్డౌన్ కొనసాగుతున్నది. కాగా మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మాస్కులు ధరించని 12మందికి రూ.1000 చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై బాలకృష్ణ తెలిపారు. వంగూరు-రంగాపూర్ రహదారిపై అకారణంగా బయట తిరుగుతున్న రెండు బైక్లను పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై కేసు నమోదు చేశామన్నారు. పోల్కంపల్లిలో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా కిరాణ దుకాణం తెరిచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఇప్పటికైనా మండల ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనాను అరికట్టేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.