బడంగ్పేట, జూలై 2 : పట్టణాల రూపురేఖలు మార్చడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో బడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్స్ తీగల విక్రంరెడ్డి, ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్ ప్రతిజ్ఞ చేయించారు.
కాలనీల్లో పాదయాత్ర చేసి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బా లాపూర్లో అమ్మవారి దేవాలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల పట్టణ ప్రగతి కింద ప్రభుత్వం రూ. 148కోట్లు మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు నేరుగా నిధులు కేటాయిస్తున్నదన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్కు ప్రతి నెల రూ. 64లక్షలు కేటాయిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆరు వార్డు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. వార్డు కమిటీ సభ్యులు, సీనియర్ సిటిజన్స్, మహిళా సంఘాలు, ప్రజలు అందరూ భాగస్వాములు అయితేనే పట్టణ ప్రగతి విజయవంతం అవుతుందన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నా రు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్లు చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్స్ ఇబ్రాం శేఖర్, తీగల విక్రంరెడ్డి, కమిషనర్ సుమన్రావు, కృష్ణ మోహన్రెడ్డి, కార్పొరేటర్స్ పెద్ద బావి సుదర్శన్రెడ్డి, బీమిడిస్వప్న జంగారెడ్డి, సూర్ణ గంటి అర్జున్, గౌర రమాదేవి శ్రీనివాస్, ఏనుగు రాంరెడ్డి, యాతం పవన్యాదవ్, శ్రీనివాస్రెడ్డి, మాదరి సురేఖ రమేశ్, సిద్ధాల బీరప్ప, ఏనుగుల అనిల్కుమార్, సుక్క శివకుమార్, కౌషిక్రెడ్డి, టీఆర్ఎస్ బడంగ్పేట అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రాళ్ల గూడెం శ్రీనివాస్రెడ్డి, బోయపల్లి శేఖర్రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, శ్రీనివాస్, రమేశ్, పుట్టగల్ల సంతోశ్, అర్కల కామేశ్రెడ్డి ఉన్నారు.