రామగిరి, జనవరి 1 : 2024 నూతన సంవత్సరం వేడుకలు జిల్లా వ్యాప్తంగా ప్రజలు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయమే కుటుంబ సభ్యులు, బంధువులకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ప్రార్థ్ధన చేయగా మరో వైపు కేక్ కటింగ్లు, ప్రత్యేక గీత ఆలపనతో ఆయా ప్రాం తాల్లో నూతనోత్సవం కనిపించింది. ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలు, నివాసాల్లో కేక్ కటింగ్లు చేసి శుభాకాంక్షలు తెలిపారు.
నల్లగొండలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి వారి నివాసాల్లో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాక్షించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, అభిమన్యు శ్రీనివాస్, పంకజ్ యాదవ్, కటికం సత్తయ్యగౌడ్, మారగోని గణేశ్, రావుల శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీలు, ప్రజా ప్రతినిధుపాల్గొన్నారు. అనంతరం సూర్యాపేటకు వెళ్లి మాజీ మం త్రి, సూర్యాపేట ఎమ్మెల్మే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని కలిసి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
నల్లగొండ ఇన్చార్జీ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ కలెక్టరేట్లోని చాంబర్లో ఉద్యోగులతో కలిసి కేక్కట్ చేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. పలు ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈవేడుకల్లో నల్లగొండ, మిర్యాలగూడ ఆర్డీఓలు రవి, చెన్నయ్య, జడ్పీ సీఈఓ ప్రేమ్కరన్రెడ్డి, డీపీఆర్వో పి.శ్రీనివాస్, డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి, ఇన్చార్జీ మున్సిపల్ కమిషనర్ కందుకూరి వెంకటేశ్వర్లు, జడ్పీలో ఉద్యోగులు కేక్కట్చేశారు.
చిట్యాల : నూతన సంవత్సరం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెలిమినేడు శివారులోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు మండల నాయకులు చిరుమర్తికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు నకిరేకల్లో ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనర్సింహ,పోకల దేవదాసు, జడల చినమల్లయ్య, బట్టు అయిలేశ్, మేడిశెట్టి ఉమాశంకర్, కోనేటి యాదగిరి ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు.