నల్లగొండ, మార్చి 27 : యాసంగి ధాన్యాన్ని నేటి నుంచి కొనుగోలు చేయనున్నందున అన్ని కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో గత సమస్యలు పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలకు సూచించారు.
ఎండలు ఎకువగా ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నాణ్యతా ప్రమాణాల ప్రకారం తేమ, తాలు శాతం సరిగా ఉండేలా చూసుకోవాలని, ఈ విషయంపై కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతుల వద్ద నుంచే ధాన్యం కొనుగోలు చేయాలని, మధ్య దళారుల ప్రమేయం ఉండరాదని అన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేశామని, అకడ నిరంతరం తనిఖీలు ఉంటాయని తెలిపారు.
బయటి రాష్ట్రం నుంచి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు సందర్భంలో ఏవైనా సమస్యలు వస్తే స్థానిక తాసీల్దార్, ఆర్డీఓలు పరిషరించడానికి అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రభుత్వం గ్రేడ్-ఏ ధాన్యానికి రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 మద్దతు ధర చెల్లిస్తుందని చెప్పారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు ప్రారంభించకూడదని, ప్రారంభంలో పాల్గొనకూడదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయపరమైన ఫ్లెక్సీలు ఉండకూడదని, ఈ విషయంలో నిర్వాహకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
లేదంటే కోడ్ ఉల్లంఘన కింద క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో పౌరసరఫరాలు, డీఆర్డీఏ, వ్యవసాయ, జిల్లా కో ఆపరేటివ్, మారెటింగ్, తూనికలు, కొలతలు, ట్రాన్పోర్టు శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ నాగేశ్వర్రావు, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీసీఓ కరుణాకర్, డీఏఓ శ్రవణ్కుమార్, జిల్లా తూనికలు, కొలతల అధికారి రామకృష్ణ, జిల్లా మారెటింగ్ అధికారి శ్రీకాంత్ పాల్గొన్నారు.