రోజురోజుకు ముదురుతున్న ఎండలకు వరి పొలాలు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు అడుగంటి నీళ్లందకపోవడంతో చేతికందివచ్చిన పంటలు వాడిపోతున్నాయి. ఎండిపోయిన పొలాలను చేసేదేమీ లేక పశువులు, గొర్రెలకు మేతగా వదిలేస్తున్న దుస్థితి నెలకొన్నది.
శాలిగౌరారం ప్రాజెక్టు ఆయకట్టు కింద రైతు చామల దేవేందర్రెడ్డి తనుకు ఉన్న ఎకరం పొలాన్ని ప్రాజెక్టు నీటితోనే కొన్నేండ్లుగా సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం కాల్వ నీళ్లు అందక పంట పూర్తిగా ఎండిపోయింది. దాంతో గొర్రెలకు మేతగా ఇచ్చేశాడు. యాసంగిలో సాగు చేసిన రైతులందరి పరిస్థితి ఇలాగే ఉన్నది. -శాలిగౌరారం, 20