యాదాద్రి, డిసెంబర్ 1: తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కిష్టయ్యకు నివాళి అర్పించారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో యాదగిరిగుట్ట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలతోనే తెలంగాణ సిద్ధించిందన్నారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట సీఐ సైదయ్య, ఎస్ఐలు శేఖర్, చంద్రశేఖర్, ముదిరాజ్ సంఘం పట్టణాధ్యక్షుడు వంగపల్లి అరుణ్కుమార్, నాయకులు వెంకటేశ్, గిరి, కృష్ణ, సుధాకర్, ఎల్ఎన్ రావు, శ్రీహరి, నర్సింగ్ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : కొరటికల్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కిష్ట య్య చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం నియోజకవర్గకన్వీనర్ చామకూర నారాయణ, గ్రామశాఖ అధ్యక్షుడు ఆంజనేయు లు, వెంకటయ్య, మురళి, లక్ష్మణ్, నరేశ్, స్వామి, మహేశ్ పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : మండలంలోని కొలనుపాకలో పెద్దమ్మ ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో కిష్టయ్య వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్రెడ్డి, మాజీ ఎంపీటీసీ మామిడాల అంజయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు బెదరబోయిన శంకర్, గుర్రాల రామచంద్రం, కాటబోయిన రాజు, గుర్రాల బాలకృష్ణ, గడ్డం సిద్ధులు, బోయిని ఝాన్సీ, గుర్రాల బాలరాజు, తొడేటి నరేందర్ పాల్గొన్నారు.
బొమ్మలరామారంలో…
బొమ్మలరామారం : మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుషంగల సత్యనారాయ ణ, ఎల్లబోయిన రవిశంకర్, బాలనర్సింహ, చంద్రమౌళి, గణేశ్, ఉపేందర్, ప్రభాకర్, భరత్, నర్సింగ్రావు, ధనరాజ్, బాలకృష్ణ, భాస్కర్ పాల్గొన్నారు.