యాదగిరిగుట్ట, నవంబర్ 29 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. గంటన్నర పాటు అర్చక బృందం శాస్ర్తోక్తంగా జరిపారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శ ఆళ్వారులను కొలుసూ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మం డపంలో ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణతంతును జరిపారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వయంభూ నారసింహుడిని మేల్కొలిపారు.
అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్ర ధానాలయంలో స్వామివారికి నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం స్వా మివారికి తిరువీధిసేవ, దర్బార్సేవ వైభవంగా జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపం లో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి.
ఉదయం నుంచి సాయం త్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అనుబంధ రామలింగేశ్వరాలయంలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొండకింద వ్రత మండపంలో దంపతులు పాల్గొన్నారు. సుమారు 13వేల మం ది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆల య అధికారులు తెలిపారు. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ.20,10, 595 ఆదాయం సమకూరిందని ఈఓ గీత, అనువంశికధర్మకర్త నరసింహమూర్తి తెలిపారు.