యాదగిరిగుట్ట, మార్చి3 : పంచనారసింహుడి క్షేత్రంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. ఆదివారం సెలవుదినం కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే నారసింహుడిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నిత్య తిరుకల్యాణోత్సవం, సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.