యాదాద్రి: యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగులు, నడువరాని స్థితిలో ఉన్న భక్తుల కోసం ఎస్కలేటర్(కదిలే మెట్లు)ల బిగింపు ప్రక్రియ సోమవారం వైటీడీఏ అధికారులు ప్రారంభించారు.
కొండపైన గల క్యూ కాంప్లెక్స్లో మొదటి అంతస్థు నుంచి ప్రసాద విక్రయ భవనం వరకు ఎస్కలేటర్ల నిర్మాణం పనులు చేపట్టారు. ఒక్కో ఎస్కలేటర్ సుమారు 35 ఫీట్ల పొడవు ఉంటుందని వైటీడీఏ అధికారులు వెల్లడించారు. త్వరలో పనులు పూర్తి చేసి ఎస్కలేటర్ను భక్తులకు అందుబాటులో తీసుకువస్తామని తెలిపారు.