యాదగిరిగుట్ట, భువనగిరి : యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 67. 62 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 3,85,950, కైంకర్యముల ద్వారా రూ. 6,516, సుప్రభాతం (Suprabhatam) ద్వారా రూ. 18,900, బ్రేక్ దర్శనం ద్వారా రూ. 4,88,100 ఆదాయం సమకూరిందని తెలిపారు. వ్రతాలను నిర్వహించడం ద్వారా రూ. 1,89,300, వాహన పూజల ద్వారా రూ. 13,100, వీఐపీ (VIP) దర్శనం ద్వారా రూ. 8,85,000 ఆదాయం వచ్చిందని అన్నారు. ప్రచారశాఖ ద్వారా రూ.45,670, పాతగుట్ట ద్వారా రూ. 52,860, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ. 8 లక్షలు, యాదఋషి నిలయం ద్వారా రూ. 2,07,650, సువర్ణ పుద్వారా రూ. 1,38,600, శివాలయం ద్వారా రూ. 13,100, పుష్కరిణీ ద్వారా రూ. 1,500 ఆదాయం ఆలయానికి సమకూరిందని వివరించారు.
ప్రసాదవిక్రయం ద్వారా రూ. 18,64,650, శాశ్వత పూజలు ద్వారా రూ. 15,000, కళ్యాణ కట్ట ద్వారా రూ. 1,37,450, ఆలయ పునరుద్ధణ నిధి ద్వారా రూ. 6,500, లాకర్స్ ద్వారా రూ.220, లిజేస్ లీగల్ ద్వారా రూ. 14,19,786 , అన్నదానం ద్వారా రూ. 71,862 ఆదాయం వచ్చిందని వెల్లడించారు.