భువనగిరి కలెక్టరేట్ : ఉద్యోగుల బదలాయింపు కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించబడిన ఉద్యోగుల సీనియారిటీ జాబితా, ఖాళీల వివరాలను అందజేయాలని జిల్లా శాఖాధిపతులను కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టర్ జిల్లా అధికారులతో ఉద్యోగుల కేటాయింపులపై గూగుల్మీట్ ద్వారా మాట్లాడారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఇందులో భాగంగా 30న కేటాయింపు ఉత్తర్వుల జారీ, 31వ తేదీన కేటాయించిన స్థానాల్లో ఉద్యోగులు విధుల్లో చేరడం జరుగుతుందని తెలిపారు. గూగుల్మీట్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి నాగేశ్వరాచారి తదితరులు ఉన్నారు.