యాదాద్రి : భక్తలకు కల్ప తరువుగా నిలుస్తున్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం అధ్యయనోత్సవాలు రెండోరోజు అంగరంగ వైభవంగా జరిగాయి. మంగళవారం ఉదయం స్వామివారి నిత్య ఆరాధనల అనంతరం తిరుమంజన మహోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ప్రబంధ పాశురాలను పఠిస్తూ పురప్పాట్ సేవను వైభవంగా నిర్వహించారు. స్వామివారి సేవను ఆలయంలో బజా భజంత్రీలతో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆళ్వారులు కీర్తించిన ప్రబంధాల్లోని పాశురాలను అనుసంధానం చేశారు.
సాయంకాలం..
పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సాయంకాలం నిత్యారాధన అనంతరం దివ్య ప్రబంధంను పారాయణికులు పఠిస్తూ పురప్పాట్ సేవను వైభవంగా నిర్వహించారు. స్వామివారి సేవను ఆలయంలో బజా భజంత్రిలతో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆళ్వారులు కీర్తించిన ప్రబంధాల్లో పాశురాలను అనుసంధానం చేశారు. ఈ వేడుకల్లో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, పాతగుట్ట ఆలయ ప్రధానార్చకులు మాధవాచార్యులు, ఉప ప్రధానార్చకులు సంపతాచార్యులు, ఏఈవోలు దోర్బాల భాస్కర్ శర్మ, శంకర్, జూనియర్ అసిస్టెంట్లు నర్సింహ, సింహచారి, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.