మోటకొండూర్: సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశపెడుతున్న ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను నూతనంగా ఎన్నికైన మండల, గ్రామ కమిటీల సభ్యులు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
మోటకొండూర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన బోట్ల యాదయ్య ప్రభుత్వ విప్ దంపతులను హైదరాబాద్లోని వారి నివాసంలో మండల, గ్రామకమిటీ నూతన కార్యవర్గ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులతో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిసి పుష్పగుచ్ఛం అందించి, ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దంపతులు మాట్లాడుతూ.. మండలంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పార్టీ శ్రేణులంతా సైనికుల్లా పనిచేయాలన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల న్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లా వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరోజు వెంకటాచారి, టీఆర్ఎస్ మండల మహిళ అధ్యక్షురాలు బొలగాని నాగమణి, యూత్ విభాగం మండలాధ్యక్షుడు బీస కృష్ణంరాజు, నార్మాక్స్ డైరెక్టర్ లింగాల శ్రీకర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు భూరెడ్డి రవీంద ర్రెడ్డి, అనంతుల జంగారెడ్డి, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల రవీందర్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాల్ధ లింగం, గ్రామాధ్యక్షుడు సుధీర్, సీనియర్ నాయకులు పైళ్ల సత్యనారాయణరెడ్డి, భూమండ్ల శ్రీనివాస్, నర్సింహులుయాదవ్, నర్సిరెడ్డి, బాల్ధ సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.